రాష్ట్రంలో పరువు హత్యలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. కూతురు కులాంతర, మతాంతర ప్రేమ పెళ్లిలు చేసుకుంటున్నారని అమ్మాయి బంధువులు హత్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి హత్యలు రాష్ట్రంలో అనేకం జరుగుతూ సంచలనంగా మారుతున్నాయి. అచ్చం ఇలాంటి పరువు హత్యే తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, ఘనాపూర్ గ్రామానికి చెందిన అశ్రిన్ అనే యువతి యువకుడు కొంత కాలం ప్రేమించుకున్నారు. అయితే కొన్నాళ్లకి వీరిద్దరి ప్రేమ విషయం అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలిసింది. కాగా ఇద్దరు మతాలు వేరు కావడంతో అమ్మాయి కుటింభికులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను ఎదురించి వీరిద్దరూ జనవరి 31న పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి వీరు హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నివాసం ఉంటున్నట్లు అమ్మాయి బంధువులు తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: News: రక్షణ కోసం వస్తే.. స్టేషన్లోనే బాలికపై అత్యాచారం చేసిన పోలీస్!
అయితే కాపుకాసిన అశ్రిన్ సోదరుడు.. నాగరాజు, అశ్రిన్ బైక్ మీద వెళ్తుండగా గమనించాడు. వెంటనే వారిని వెంబడించి అశ్రిన్ సోదరుడు ఇనుపరాడుతో నాగరాజుని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా హత మార్చాడు. ఈ దాడిలో నాగరాజు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక అనంతరం కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పట్టుకుని విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ పరువు హత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.