అనుమానంతో చూసిన ఓ మహిళ ఊహించని దారుణానికి పాల్పడింది. ఏకంగా యువతిపై నలుగురు యువకులతో అత్యాచారం చేయించి ఆపై వీడియోలు తీసిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి (26) అశోక్నగర్లోని హాస్టల్లో ఉంటూ ఓ ఇన్స్టిట్యూట్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది.
కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ గతేడాది జరిగిన ఆన్లైన్ క్లాసులో పరిచమయ్యాడు. ఇక శ్రీకాంత్ కి తొమ్మిది సంవత్సరాల క్రితం గాయత్రి (36) అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. బాధిత యువత ఆ భార్యాభర్తలతో చాలా కాలం పాటు స్నేహంగా మిలిగేది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారి ఇంట్లోనే ఉంది. కాగా వీరి ముగ్గురి మధ్య పరిచయం చాలా కాలం పాటే సాగింది. వీరితో కలిసి ఆ యువతి షికారులకు, షాపింగ్ కలు వెళ్లటం కూడా చేసింది.
అయితే ఉన్నట్టుండి ఈ మధ్యకాలంలో ఆ యువతి వారి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఒకసారి గాయత్రికి తన భర్తతో ఆ యువతి సన్నిహితంగా ఉంటుందనే అనుమానం బలపడింది. దీంతో గాయత్రి ఏప్రిల్ 22న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాయత్రితో పాటు శ్రీకాంత్ను, ఆ యువతిని పిలిచి కౌన్సెలింగ్ చేశారు. అయినా ఆ యువతిపై అనుమానం మాత్రం పోలేదు. దీంతో ఎలాగైన ఆ యువతిని హింసించాలనే పథకం మాత్రం వేసుకుంది.
ఇందులో భాగంగానే మస్తాన్(25), ముజాహిద్లతో (25), విష్ణు (22) మనోజ్ (22), మౌలాలిలతో కలిసి దారుణానికి పాల్పడేందుకు సిద్దమైంది. ఇక గురువారం బాధిత యువతికి ఫోన్ చేసి కొండాపూర్కు వస్తే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని పిలిచి ఓ ఇంట్లోకి తీసుకెళ్లింది. ముందుగానే పథకం ప్రకారం ఐదుగురు యువకులు ఇంట్లోనే ఉన్నారు. ఇక యువతి రాగానే నోట్లో గుడ్డలు కుక్కి వివస్త్రను చేశారు. ఆ తర్వాత గాయత్రి సామూహికంగా అత్యాచారం చేయించేందుకు ప్రయత్నించింది. ఆ యువతి జననాంగంపై దాడి చేసి దారుణంగా హింసించాడు.
ఈ దారుణాలన్నిటినీ వీడియోల రూపంలో కూడా తీశారు. ఇక ఈ దాడి అనంతరం దుండగులు ఇంట్లో నుంచి పారిపోయారు. ఇక బాధితురాల అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రి సహా పరారీలో ఉన్న నిందితులను శనివారం అరెస్టు రిమాండ్కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.