ఈ మధ్యకాలంలో యువతి, యువకులు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారని, చదువులోని రాణించట్లేదని ఇలా కారణాలు వేరైన చివరికి సూసైడ్ కు పాల్పడుతున్నారు. తాజాగా పెళ్లి కావడం లేదని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివేక్ నగర్లో విజయ లక్ష్మి(26) అనే యువతి కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూతురికి వివాహం చేయాలని తల్లిదండ్రులు అనేక పెళ్లి సంబంధాలు తీసుకొచ్చారు. ఇలా వచ్చిన సంబంధాలు వచ్చినట్టే క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏం చెయాలో, ఎవరికి చెప్పాలో అర్థం కాని సందిగ్ధింలో మునిగిపోయింది. చుట్టుపక్కల వ్యక్తులు, బంధువులు అనే సూటిపోటి మాటలతో ఆ యువతి తట్టుకోలేకపోయింది.
ఇది కూడా చదవండి: Pakistan: కన్న తండ్రిపై కుమారుడి కిరాతకం.. శరీరాన్ని ముక్కలుగా నరికి!
ఇలా అయితే తనకు పెళ్లి కాదని భావించింది. దీంతో లోలోపల మానసికంగా కుమిలిపోతూ ఉంది. కాగా ఈ నేపథ్యంలోనే తనకు ఇక పెళ్లికాదేమోనని భయంతో యువతి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చేసింది. ఇక అనుకున్నట్లుగానే ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. దీంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక చికిత్స పొందుతు విజయలక్ష్మీ గురువారం ప్రాణాలు విడిచింది.
కూతురి మరణవార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఇలా చిన్న చిన్న కారణాలకు యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడకూడదని, ధైర్యంతో ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న యువతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.