ఈ మధ్యకాలంలో మహిళల ఆత్మహత్యలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని, భర్త, అత్తామామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని.. ఇలా కారణాలు వేరైన పరిష్కారం ఒకటే అంటే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రిలో దువ్వాసి సరస్వతి అనే యువతి రెడీయాలజీ ల్యాబ్ టెక్నిషియన్ గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఇదే ఆస్పత్రిలో ఆ యువతికి గత కొన్ని రోజుల నుంచి పలువురు ఉన్నతాధికారులు నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. ఇన్నాళ్లు తట్టుకుంటూ వచ్చింది. ఇటీవల సరస్వతికి వాళ్లకు ఇష్టమొచ్చినట్లుగా నైట్ షిఫ్ట్ లు వేస్తున్నట్లుగా తన సహచర ఉద్యోగులతో తన ఆవేదనను వెల్లగక్కిందట.
ఇది కూడా చదవండి: Hyderabad: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు: పోలీసుల అదుపులో వక్ఫ్బోర్డ్ ఛైర్మన్ కుమారుడు!
ఇక ఇవేవి పట్టనట్లుగా ఆ అధికారులు ఆ యువతికి నైట్ షిఫ్ట్స్ వేస్తూ డ్యూటీలో వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో భరించలేని సరస్వతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏం చేయాలో తెలియక గురువారం రాత్రి తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన సహచర ఉద్యోగులు అదే ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. ఇక అప్పటికే సరస్వతి మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
ఇదే విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న సరస్వతి తల్లిదండ్రులు కూతురుని చూసి బోరున విలపించారు. ఆస్పత్రిలో ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి ఆరోపించారు. ఇక ఇంతటితో ఆగకుండా పంజాగుట్ట పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఇక సరస్వతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.