రాష్ట్రంలో సంచలన సృష్టిస్తున్న జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులు.. ఎట్టకేలకు ఎమ్మెల్యే కుమారుడిని నిందితుడిగా చేర్చారు. మొత్తానికి ఈ కేసులో నిధితుల సంఖ్య 6కు చేరింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందన్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. మీడియా సమావేశంలో పలు కీలక వివరాలు వెల్లడించారు.
జూబ్లీహిల్స్ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్.. స్కూల్ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్లో స్నేహితులతో ప్లాన్ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్ను ఎంచుకుని.. ఏప్రిల్లో పార్టీ గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. నాన్ ఆల్కాహాలిక్, స్మోకింగ్ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్ను బుక్ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్ మళ్లీ పోస్ట్ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం 03:15కు బాధితురాలు పబ్కు వెళ్లింది.
నిందితులు.. పబ్లో ముందుగానే పథకం వేసుకున్నారు. ఆమె ఫాలో చేసి ట్రాప్ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్ 44లో రోడ్ నెంబర్ 44 లోని నిర్మానుష్య ప్రాంతానికి భాధితురాలును తీసుకెళ్లారు. అక్కడే నిందితులు భాధితురాలుపై హత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తరువాత ఒకరు భాధితురాలుపై హత్యాచారం చేశారు. రాత్రి 7:31 గంటలకు ఇన్నివాలోనే పబ్ దగ్గర భాధితురాలును వదిలిపెట్టారు. పబ్ దగ్గరకి వచ్చాక భాధితురాలు తండ్రికి ఫోన్ చేసింది. మే 28న ఘటన జరిగింది. మే 31 వరకు బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు చేశారు.
భరోసా సెంటర్లో కౌన్సెలింగ్ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం. పబ్, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్తో పాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్తో పాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితుల్లో ఒకరిని తప్ప మిగిలిన వారిని బాలిక గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్ 3న సాదుద్దీన్ను అరెస్ట్ చేశాం. ఏ1 సాదుద్దీన్తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్తో పాటు నలుగురిని అరెస్ట్చేశాం. మరొకరి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
మైనర్ బాలిక ఆత్యాచారం రోజు సాయంత్రం 6.15 నుంచి 7.30 మధ్య ఏం జరిగిందంటే.. https://t.co/3SfxGwBSdF@CPHydCity
— SumanTV NEWS (@SumantvNEWS) June 7, 2022