Husband: భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం సహజం.. ఆ గొడవలే పెచ్చుమీరి కొంతమందిని రాక్షసుల్ని చేస్తున్నాయి. కొంతమంది భర్తలు.. భార్యల మీద దాడులు చేస్తుంటే.. మరికొంతమంది భార్యలు భర్తల మీద దాడులకు దిగుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ కాపురాల్ని నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికే దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ భర్త. తన భార్య సారీ చెప్పినా పట్టించుకోవటం లేదని, వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, బెహ్రాచీలోని బెద్నాపూర్కు చెందిన గ్యాన్దత్ పతాక్, రజినీ దేవీలు భార్యాభర్తలు. రజినీ దేవీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిరుద్యోగి. భర్తతో గొడవల కారణంగా కొద్దిరోజుల క్రితం ఆమె బన్స్గావ్లోని0 పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో శనివారం భార్యను వెనక్కు తీసుకురావటానికి గ్యాన్దత్ అత్తారింటికి వెళ్లాడు. ఆమెకు క్షమాపణ చెప్పి, ఇంటికి రమ్మన్నాడు. ఆమె తిరిగిరానని చెప్పింది. భార్య కోసం బన్స్గావ్లోనే ఉండిపోయాడు. సాయంత్రం రజినీ, బిన్ను అనే వ్యక్తితో ఊరి బయట కనిపించింది. దీంతో వారిద్దరి మధ్యా వివాహేతర సంబంధం ఉందని గ్యాన్దత్ భావించాడు. ఆగ్రహానికి గురై ఆమెపై దాడి చేసి కొట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ముక్కును కొరికేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రజినీ తల్లి తన కూతురిపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vizianagaram: మరణించిన భర్త!.. తట్టుకోలేని ఇల్లాలు కుప్పకూలిపోయింది!