మార్చి 8, 2022.. మంగళవారం..
అప్పుడే తెల్లవారింది.. రాత్రి పొలానికి వెళ్లిన భర్త లక్ష్మణ్ కోసం టీ తీసుకుని పొలానికి బయలు దేరింది బాయి దేవీ. భర్త గురించే ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తూ ఉంది. కొద్దిదూరం పోగానే తన ముందు పెద్ద బాంబు పడ్డట్టు ఓ చోట ఠక్కున ఆగిపోయింది. ముందున్న దృశ్యాన్ని చూసి గట్టిగా ‘‘ ఏవండీ!’’ అని అరవటం మొదలుపెట్టింది. ఆమెకు అడుగుల దూరంలో రోడ్డు పక్కన లక్ష్మణ్ గాయాలతో పడి ఉన్నాడు. తలనుంచి కారిన రక్తంతో ఆ ప్రాంతం మొత్తం ఎర్రగా మారింది. పక్కనే పడి ఉన్న బైక్ కూడా ఏదో ప్రమాదం జరిగినట్లు బాగా దెబ్బ తినిఉంది.
భర్త దగ్గరకు చేరుకుని ఆమె గట్టిగా ఏడుస్తూ..అరుస్తూ ఉంది. ఆ అరుపులు విన్న జనం బిలబిలా అక్కడకు చేరుకున్నారు. భర్తను పట్టుకుని ఏడుస్తూ ఉన్న బాయిదేవీని చూస్తూ అక్కడి వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యోపాపం అనుకున్నారు. పోలీసులకు సమాచారం అందింది. కొంత సేపటికి పోలీసులు వచ్చారు. లక్ష్మణ్ను పరీక్షించి చనిపోయాడని ధ్రువీకరించుకున్నారు. శవాన్ని అక్కడినుంచి పోస్టుమార్టానికి తరలించారు. బాయిదేవీ భర్త చనిపోయాడని తెలిసినప్పటినుంచి ఏడుస్తూనే ఉంది. బంధువులు ఆమెను ఎంత ఓదార్చటానికి ప్రయత్నించినా వల్ల కావటం లేదు.
………
మధ్యాహ్నం..
బనేతా పోలీస్ స్టేషన్..
స్టేషన్ ఆఫీసర్ రాజ్మల్ కుమావత్ తన కుర్చీలో కూర్చుని ధీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన కూడా లక్ష్మణ్ యాక్సిడెంట్ గురించి. యాక్సిడెంట్ గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది?…
ఉంది..
లక్ష్మణ్ది యాక్సిడెంట్ కాదు.. హత్య అన్నది అతడి అనుమానం.. లక్ష్మణ్ది హత్య అనటానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి.
నెంబర్ వన్ : లక్ష్మణ్ ఒంటిపైన గాయాలు యాక్సిడెంట్లో అయ్యే గాయాలకంటే భిన్నంగా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎవరో అతడ్ని కొట్టినట్లుగా ఉంది.
నెంబర్ టు : రోడ్డు పక్కన బైక్ పడి ఉన్న స్థితి. మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినపుడు బైక్ పాడయ్యే స్థితికి, సంఘటనా స్థలంలో బైక్ పడిఉన్న స్థితికి చాలా తేడా ఉంది. దానికి తోడు బైకు పడి ఉన్న కోణం కూడా అనుమానంగానే ఉంది.
ఈ అనుమానాలతో దీన్ని యాక్సిడెంట్ కేసుగా క్లోజ్ చేయాలనుకోలేదు. అందుకే అంతా ఎంక్వైరీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. వెంటనే లక్ష్మణ్ సొంతూరు ఖద్దో హట్స్కు వెళ్లాడు. యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు. బాయి దేవీని, కొందరు గ్రామస్తులను ఎంక్వైరీ చేశాడు. వాళ్లు ఇచ్చిన సమాచారం అతడి అనుమానానికి బలం చేకూర్చినట్లు అయింది.
లక్ష్మణ్ గురించి, అతడి భార్య గురించి, ఆ కుటుంబం గురించి ఎంక్వైరీ చేశాడు. అతడి అనుమానమే నిజమైంది.
యాక్సిడెంట్ కేసును కాస్తా మర్డర్ కేసుగా మార్చాడు.
లక్ష్మణ్ భార్య బాయిదేవిని, అదే గ్రామానికి చెందిన రామ్ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నాడు. వాళ్లను పోలీస్ స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది.
………
బాయిదీవికి, రామ్ ప్రసాద్కు చాలా కాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది. భర్తకు తెలియకుండా ఇద్దరు ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. రోజులు గడుస్తున్నాయి. దొంగచాటుగా కలవటం ఇద్దరికీ ఇబ్బందిగా మారింది. భర్తను అడ్డు తప్పిస్తే ఇద్దరూ సంతోషంగా ఉండొచ్చు అనుకున్నారు. ఇందు కోసం ఓ ప్లాన్ వేశారు.
మార్చి 7, 2022.. సోమవారం
భార్య, ఆమె ప్రియుడి రూపంలో తనను మృత్యువు చేరబోతోందని తెలియని లక్ష్మణ్ ఇంట్లోని గదిలో హాయిగా నిద్రపోతున్నాడు. అతడు గాఢ నిద్రలో ఉన్నాడని తెలియగానే బాయిదేవీ ఇంటి తలుపులు తెరిచి రామ్ ప్రసాద్ను ఇంట్లోకి పిలిచింది. రామ్ ప్రసాద్ పెద్ద బండరాయిని తీసుకుని బాయిదేవీ వెంట నడిచాడు. ఇద్దరూ లక్ష్మణ్ నిద్రపోతున్న చోటుకు చేరుకున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రామ్ ప్రసాద్ బండరాయితో లక్ష్మణ్ తలపై కొట్టాడు. నోరు తెరవకుండా పదే పదే దెబ్బలు వేశాడు. లక్ష్మణ్ చనిపోయాడు.
ముందు అనుకున్నట్లుగానే ఈ హత్యను యాక్సిడెంట్గా మార్చటానికి అతడి శవాన్ని, బైక్ను ఊరి బయట రోడ్డు మీదకు తీసుకువచ్చారు. లక్ష్మణ్ పొలం పనులకు వెళ్లటానికి ఈ రోడ్డు మీదనుంచే వెలుతుంటాడు. దీన్ని వాళ్లు అవకాశంగా మలుచుకోవాలనుకున్నారు. లక్ష్మణ్ తలను రోడ్డుకు కొట్టి, బైక్ను విరగొట్టి యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో అలా సృష్టించటానికి ప్రయత్నించారు. శవాన్ని, బైక్ను రోడ్డు పక్కన పడేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఉదయం బాయిదేవీ పొలంలో ఉన్న భర్త కోసం టీ తీసుకువెళుతున్నట్లు వెళ్లింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భార్యతో చనువుగా యువకుడు.. అతడి అడ్డు తొలిగిస్తేనే మంచిదని..
పెళ్లై 20 రోజులు.. మరిదిని ప్రేమించింది.. అందరూ షాక్ అయ్యేలా..
పోర్న్ చూసి రెచ్చిపోయారు.. పొలంలోని బాలికలపై..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.