crime news : అక్రమ సంబంధాల కారణంగా సభ్య సమాజం తలదించుకునే ఘటనలు జరుగుతున్నాయి. తమ సంబంధాలకు అడ్డు పడుతున్నారన్న కారణంతో తల్లిదండ్రుల్ని, తోడ బుట్టిన వాళ్లను సైతం వదలట్లేదు కొందరు. సంబంధం నలుగురికి తెలిసిపోతుందన్న భయంతో హత్యలు చేయించటానికి కూడా వెనకాడట్లేదు. తాజాగా, తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో తమ్ముడ్ని సుపారీ ఇచ్చి మరీ చంపించింది ఓ అక్క. ఈ సంఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం కాలానగర్కు చెందిన మహ్మద్ సోహేల్ అనే యువకుడి ఫ్రెండ్తో అతడి అక్కకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్తా సోహేల్కు తెలిసింది. దీంతో అతడు అక్కను హెచ్చరించాడు. ఇకపై ఇలా జరిగితే బాగోదన్నాడు. దీనికి తోడు నిందితురాలికి తండ్రి అకౌంట్లో ఉన్న 17 లక్షల రూపాయలపై కన్ను ఉంది. తమ్ముడి అడ్డు తొలిగించుకుంటే అక్రమం సంబంధం విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఎలాంటి అడ్డు ఉండదని భావించింది.
తమ్ముడిని చంపటానికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చింది. నలుగురు హంతకులు గత సంవత్సరం సెప్టెంబర్ 3న సోహేల్ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ హత్య జరిగిన తర్వాత తండ్రి అకౌంట్లోని డబ్బుల్ని విత్ డ్రా చేసింది నిందితురాలు. దాదాపు 6 నెలల తర్వాత సోహేల్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.