బాపట్ల జిల్లాలోని రేపల్లే రైల్వే స్టేషన్ గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. శనివారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
ఇది కూడా చదవండి: Krishna: తల్లితో సహజీవనం, కూతురిపై అత్యాచారం.. చివరికి జరిగింది ఇదే!
ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో సీఎం ఫోన్లో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు రేపల్లె నేతాజీ నగర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.