ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల మాయలో పడి చాలా మంది మోసపోతున్నారు. లక్కీ డ్రా వచ్చిందంటూ, మీరు పేరుపై విలువైన బహుమతులు వచ్చాయంటూ ఇలా అనేక రకాల సాకులు చెబుతూ సైబర్ ముఠా నట్టేట ముంచుతోంది. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నిండా మోసపోయాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లాలో చంద్రగిరికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఓ లింక్ వచ్చింది.
వెంటనే ఆ లింకును ఓపెన్ చేశాడు. అక్కడ కొన్ని సూచనలు పాటించారు.. డబ్బులు డబుల్ అవుతాయని చెప్పడంతో నిజమని భావించి అలా చేయడంతో ఏకంగా రూ. 20లక్షల వరకు ఆన్లైన్ పేమెంట్ను చెల్లించారు. ఇంతలో ట్విస్ట్ ఇస్తూ.. రూ.20 లక్షలకు రూ.40 లక్షలు ఇస్తామన్నారు. ఆ రూ.40 లక్షలు పొందాలంటే ముందు రూ.8 లక్షలు ట్యాక్స్ చెల్లించాలని మెసేజ్ రావడంతో అవాక్కయ్యారు.
ఇది కూడా చదవండి: కొంప ముంచిన మాంజా.. లక్షలు మాయం
తీరా డబ్బులు పోయిన తర్వాత కానీ మోసపోయానని గ్రహించలేకపోయారు. ఇక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నా పరువు కోసం అడుగు వేనకకు వేశాడు. అయితే ఇలాంటి సైబర్ ముఠాల చేతుల్లో మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఏం సమస్యలున్నా వెంటనే సమాచారం అందించాలని పోలీసుల సూచిస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.