ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవ చినిగి చినిగి పిల్లలను హత్య చేసేదాక వెళ్తోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా చివరికి పిల్లల హత్యకు దారి తీసింది. తాజాగా చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పుదుక్కోట్టై జిల్లా పొన్ అమరావతి సమీపంలోని కరుప్పర్ కోయిల్ పట్టి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన పొన్నాడైకల్, పంచవర్ణం (21) ఇద్దరు భార్యాభర్తలు.
వీరు ప్రేమించుకుని మూడేళ్ల కిందట పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. అయితే సొంత ఇంట్లో ఉండాలని భార్య పంచవర్ణం కోరిక. దీంతో తరుచు ఇదే విషయమై భర్తను కోరేది. కానీ ఇవేవి పట్టించుకోని భర్త పొన్నాడైకల్ మద్యానికి అలవాటు పడ్డాడు. ఇదే వారి సంసారాంలో నిప్పులు రాజేసింది. దీంతో రోజు వచ్చి భార్యతో పొన్నాడైకల్ తరుచు గొడవలు పడేవాడు. అయితే ఇటవలే పొన్నాడైకల్ భార్యా పిల్లలతో కలిసి వెళ్లాడు.
ఇది కూడా చదవండి: Nalgonda: నెలరోజుల్లో పెళ్లి.. కాబోయే భర్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య!
ఇక అక్కడ కూడా భార్యాభర్తలిద్దరికి ఓ మోస్తారు గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థానికి గురవ్వడంతో పాటు కోపం కూడా కట్టులు తెంచుకుంది. ఈ సమయంలో భార్య పంచవర్ణంకు ఏం చేయాలో అర్థం తోచలేదు. కోపంతో ఊగిపోయిన ఆమె భర్త బయటకు వెళ్లగానే తన ఇద్దరు పిల్లలను గొంతు పిసికి హత్య చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితురాలిపై కేసు నమోదు చేసుకున్నారు.
ఇలా భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలకు క్షణికావేశంలో కన్న పిల్లలను సైతం కడతేర్చేందుకు వెనకాడటం లేదు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.