చెన్నైలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. తల్లి మరణించడంతో అంత్యక్రియలకు డబ్బులు లేక శవాన్ని కుమారుడు డ్రమ్ములో కప్పి పెట్టాడు. ఆలస్యంగా వెలుగు చూసి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది చెన్నైలోని సరస్వతి నగర్. ఇదే ప్రాంతానికి చెందిన సురేష్ తన భార్య ఆయన తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు.
అయితే ఇటీవల భార్యాభర్తలకు గొడవలు మొదలయ్యాయి. దీంతో కోపంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సురేష్ తల్లితో పాటు ఇంట్లో ఉంటున్నాడు. ఇక రెండు మూడు రోజులు బాగానే ఉన్న సురేష్ తల్లి ఉన్నట్టుండి అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే తల్లి మరణించిన విషయం తెలుసుకున్న సురేష్ అంత్యక్రియలు ఎలా చేయాలని ఆలోచనలు చేశాడు. చేయటానికి డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో అతనికి తోచలేదు.
ఇది కూడా చదవండి: Karnataka: అక్కపై తమ్ముడికి అనుమానం.. ప్రియుడితో కలిసి తమ్ముడిని హత్య చేసిన అక్క!
ఈ క్రమంలోనే సురేష్ ఇంట్లో ఉన్న ఓ డ్రమ్ములో తల్లి శవాన్ని దాచి పెట్టాడు. ఇక ఎవరికి అనుమానం రాకుండా ఆ డ్రమ్ముపై సిమెంట్ కూడా చేశాడు. ఇక ఇటీవల సురేష్ భార్య ఇంటికి రాగా అత్త ఇంట్లో కనిపించ లేదు. అటు ఇటు అంతా వెతికింది. దీంతో వెంటనే భర్త అన్నకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. ఇక హుటాహుటిన వచ్చిన సురేష్ అన్న ఇంట్లో చూసే ప్రయత్నం చేశాడు. కానీ సురేష్ మాత్రం అతనిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు.
దీంతో సురేష్ అన్నకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని సురేష్ ను అడగగా.. రెండు రోజుల క్రితం అమ్మ చనిపోయిందని, అంత్యక్రియలకు డబ్బులు లేక శవాన్ని డ్రమ్ములో పెట్టినట్లుగా తెలిపాడు. ఇక పోలీసులకు సమాచారం అందించడంతో తల్లి శవాన్ని బయటకు తీశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.