Gold Mine: బంగారు గనుల్లో అనధికారిక తవ్వకాల సందర్భంగా భారీ ఘర్షణ చోటుచేసుకుంది. రెండు గ్రూపులు బంగారం కోసం కలబడి కుమ్ముకున్నాయి. ఈ ఘర్షణలో 100 మంది మృతి చెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దక్షణాఫ్రికాలోని నార్త్ చాద్లో ఆలస్యంగా వెలుగు చూసింది. చాద్ డిఫెన్స్ మినిష్టర్ దావుద్ యాయా బ్రాహిమ్ మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. మే 23, 24 తేదీల్లో కౌరీ బగౌరీ జిల్లాలోని కొండల్లో ఉన్న బంగారు గనుల్లో అనధికారిక బంగారు తవ్వకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో చాద్ సరిహద్దు దేశాలైన మౌరిటానియా, లిబియాలకు చెందిన రెండు వేరు వేరు గ్రూపుల మధ్య గొడవ చోటుచేసుకుంది. గొడవలో రెండు గ్రూపులు కలబడి కుమ్ముకున్నాయి.
ఈ ఘర్షణలో 100 మంది దాకా మరణించగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ప్రభుత్వం అక్కడకు ఓ నిజ నిర్థారణ కమిటిని పంపింది. మే 25న అక్కడికి వెళ్లిన కమిటి దుర్ఘటన నిజమేనని తేల్చింది. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న మిలటరీ బలగాలు గొడవను ఆపి, శాంతిని నెలకొల్పాయి. అనధికారిక మైనింగ్ కార్యాకలాపాలను రద్ధు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఉన్న వారిని బయటకు పంపించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Siddipet: ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరో యువతిని లేపుకెళ్లిన ప్రియుడు!