Vizag: మూడు ముళ్ల బంధంతో ఇంకోరి జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఆమె జీవితం పెళ్లి పీటలమీదే ఆగిపోయింది. సగం పెళ్లిగా భావించే జీలకర్ర బెల్లం పెట్టడానికి ముందే ఆమె ఊపిరి ఆగిపోయింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బంధు జనం కోరింతలతో అంత వరకు సందడిగా ఉన్న పెళ్లి మండపంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి పీటలపై వధువు మరణంతో రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణానికి చెందిన నాగోతి అప్పలారాజు, లలితల కుమారుడు శివాజికి.. అదే ప్రాంతానికి చెందిన ముంజేటి ఈశ్వర్ రావ్, ముంజేటి అనురాధల కుమార్తె సృజనకు కొద్దిరోజుల క్రితం పెళ్లి కుదిరింది. మధురవాడ, కాలానగర్లోని ద్రోణమ్రాజు కల్యాణ మండపంలో బుధవారం రాత్రి 7 గంటలకు పెళ్లి ముహుర్తం.
బుధవారం రాత్రి 7 గంటల సమయంలో పండితుల వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. సరిగ్గా ఆ సమయంలో ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెకు సపర్యలు చేశారు. ఎంతకీ పైకి లేవకపోవటంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు, అప్పటికే ప్రాణం కోల్పోయినట్టు నిర్ధారించారు. పెళ్లి కూతురి మరణంతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని… కానీ, ఇలా ప్రాణం కోల్పోతుందని భావించలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ విషాదకర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Tina Sadhu: ఇండస్ట్రీలో విషాదం.. ఆట టైటిల్ విన్నర్ టీనా కన్నుమూత!