ఇండియా-నేపాల్ సరిహద్దైన బీహీర్ లో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఒకే చెట్టుకు ముగ్గురు అమ్మాయిల డెడ్ బాడీలు చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో తీవ్ర సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? కరీనా గణేష్(16), కల్పనా గణేశ్(16), అంజలి గణేశ్(17) అనే ఈ ముగ్గురు మైనర్ అమ్మాయిలు సుంకోషి టీ గార్డెన్లో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరు ముగ్గురు శనివారం నుంచి కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బీహార్లోని కిషన్గంజ్ జిల్లా ఠాకూర్గంజ్ వద్ద ఓ రేగు చెట్టు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. వీరిది ఆత్మహత్యనా? లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ముగ్గురు అమ్మాయిలు, పైగా మైనర్లు ఒకే చెట్టుకు ఉరి వేసుకోవడం అనే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది.. చివరికు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది!
Three teenage girls have been found dead in mysterious circumstances in a tea estate in Jhapa.Karina Ganesh (16), Kalpana Ganesh (16) and Anjali Ganesh (17). They used to work for the tea estate there but were missing since Saturday morning.Police are taking the bodies in hospita pic.twitter.com/vL2Vxs3W5R
— Santosh Bam (@SantoshBam8) July 24, 2022