ఐపీఎల్ బెట్టింగ్ లో పడి కొందరు యువకులు సొంత ఆస్తులు కరిగేదాక పెడుతూనే ఉంటారు. చివరికి బెట్టింగ్ మైకంలో పడి చేసిన అప్పులు ఎక్కవై తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్త గూడెంలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బూర్గంపాడుకలో పాండవుల బస్తీకి చెందిన మోతుకూరి సాయి కిషన్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ క్రికెట్ మొదలవ్వడంతో బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. దీంతో బెట్టింగ్ కు బానిసై ఏకంగా రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడట. ఈ నేపథ్యంలోనే యువకుడు బెట్టింగ్ పెట్టిన డబ్బు అంతా పెట్టింది పెట్టినట్లే నష్టాలపాలయ్యాడు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: బస్ దిగమన్నందుకు కండక్టర్ ను హత్య చేసిన ప్రయాణికుడు!దీంతో అప్పులు ఇచ్చిన వ్యక్తులు తరుచూ సాయికిషన్ ను వేధించేవారు. ఇక ఆ యువకుడికి ఏ చేయాలో అర్థం కాలేదు. దీంతో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఇక చేసిన అప్పులు తీర్చడం నా వల్ల కాదని భావించి తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే సాయి కిషన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇక మరో విషయం ఏంటంటే? భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ మాఫియా జోరుగా పెరుగుతోందట. దీనిపై స్థానిక పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం కారణంగానే సాయి కిషన్ ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ లో నష్టపోయి సాయి కిషన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.