భార్య నగ్న ఫోటోలను, వీడియోలను బంధువులకు పంపాడో సైకో భర్త. తాజాగా కర్నాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతటి దారుణానికి పాల్పడటానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈ ఘటనలో మహిళ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి చత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందిన యువతిని 2015 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ దంపతులు కొంత కాలం సంతోషంగానే జీవించారు. కానీ రాను రాను భర్త ప్రవర్తన పెచ్చుమీరింది. శారీరకంగా తన భార్యతో కలుసుకునే క్రమంలో సైకోలాగా ప్రవర్తించాడు. ఇంతటితో ఆగకుండా అసహజ లైంగిక ప్రక్రియకు ఒత్తిడి చేయడం, ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు వంటివి తీయటం చేశాడు. ఇలా తీసిన వీడియోలు, ఫోటోలు బంధువులతో పాటు ఆమె తండ్రికి కూడా పంపాడు.
ఇది కూడా చదవండి: Bihar: నీతో కాపురం చేయనంటూ పోలీస్ భర్తకు తెగేసి చెప్పిన భార్య.. మనోడు ఏం చేశాడో తెలుసా!
భర్త చేసే ఈ దారుణాలకు భార్య సహించకలేకపోయింది. ఇదే విషయంపై భార్య 2019లో రాయ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం జరిగింది బెంగుళూరులో కాబట్టి ఈ కేసును అక్కడి పోలీసులు వివేకనగర స్టేషన్ కు బదిలీ చేశారు. కానీ ఇక్కడ పోలీసులు ఈ కేసును అంత సీరియస్ గా తీసుకోకపోవడంతో బాధిత మహిళకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇక పోలీసులతో న్యాయం జరగదని భావించిన ఆ మహిళ హైకోర్టులో కేసు వేసింది.
దీనిపై స్పందించిన న్యాయమర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న మహిళ కేసును స్వీకరించి పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ధర్మాసనం పేర్కొంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.