ఓ తండ్రి క్షణికావేశంలో చేసిన పనికి కన్న కొడుకు మరణించాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కుమారుడిపై పెట్రోల్ పోసి మరీ తగలబెట్టాడు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? తండ్రి అంత దారుణానికి పాల్పడడానికి గల బలమైన కారణాలు ఏమైన ఉన్నాయా? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరులోని సురేంద్ర ఫ్యాబ్రికేషన్ అనే వ్యాపారి బిజినెస్ చేస్తుండేవాడు. తనకు చేదోడు వాదోడుగా ఉంటాడని.. తన కొడుకు అర్పిత్ ను బట్టల వ్యాపారంలో చేర్చుకున్నాడు. దీంతో కొంత కాలం ఆ వ్యాపారం బాగానే సాగింది. కానీ ఆర్థిక లాభాల్లో తండ్రికి ఏదో తేడా కొట్టింది. కొడుకుని ప్రశ్నిస్తే అన్ని తలతిక్క సమాధానాలు చెప్పాడు. దీంతో నమ్మలేకపోయిన తండ్రి అతడిపై అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: పరీక్షలో పాసవ్వాలంటూ తండ్రి వార్నింగ్.. కొడుకు ఏం చేశాడో తెలుసా?
కాగా ఏప్రిల్ 1 న వాల్మీకి నగర్ లో రోడ్డుమీద అందరూ చూస్తుండగా తండ్రి తన కుమారుడైన అర్పిత్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీంతో మంటలు అంటుకోవడంతో స్థానికుకులు చూసి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన కొడుకు గురువారం మరణించాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.