Crime News In Telugu: బంగ్లాదేశ్లో మైనారిటీలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. తరచుగా ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా, ఓ మైనారిటీ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు. అనంతరం బాలిక చనిపోయిందని, ఆమె కోసం వెతకొద్దంటూ ఆమె సోషల్ మీడియాలోనే పోస్టు పెట్టాడు. ఈ సంఘటన గత ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బంగ్లాదేశ్, షేర్పూర్కు చెందిన 15 ఏళ్ల అనురాధా సేన్ తాజాగా పదవ తరగతి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జులై 25వ తేదీ ఆదివారం రోజు బాలిక ఇంటికి ఓ ఫోన్ వచ్చింది. బాలిక పై చదువుల కోసం డబ్బు సహాయం చేస్తామని, ఆమెను స్కూలు దగ్గరకు పంపిస్తే డబ్బు ఇస్తామని ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. అది నిజమేనని నమ్మిన అనురాధ తల్లి ఆమెను స్కూలుకు పంపింది.
కొన్ని గంటల తర్వాత తమకు వచ్చిన ఫోన్ కాల్ అబద్ధమని బాలిక కుటుంబం గ్రహించింది. అనురాధ తండ్రి వెంటనే స్కూలు దగ్గరకు వెళ్లాడు. అక్కడ బాలిక కనిపించలేదు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు రాత్రి అనురాధ ఫేస్బుక్లో ఓ పోస్టు పడింది. ఆ పోస్టులో బాలిక ఫొటోలతో పాటు.. ‘‘ ఈమెను మీరు వెతకాల్సిన అవసరం లేదు. తను చనిపోయింది. చంపేశాను’’ అని రాసుంది.
పోలీసులు ఆ పోస్టు పెట్టింది ఎవరా అన్న కోణంలో విచారణ చేపట్టారు. దీనిపై అనురాధ సోదరుడు మాట్లాడుతూ.. ‘‘ ఘటన జరగటానికి మూడు రోజుల ముందు నాకోక ఫోన్ వచ్చింది. బరీ మెహ్దీ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. అనురాధ తనను ప్రేమించి మోసం చేసిందన్నాడు. ఇప్పుడు మరో వ్యక్తితో తిరుగుతోందని, మంచి పద్దతి కాదని హెచ్చరించాడు’’ అని చెప్పాడు. అయితే, నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మొగుడికి మస్కా కొట్టి ప్రియుడికి జైకొట్టిన భార్య! ఆ తర్వాత జరిగింది ఇదే!