Amnesia Pub Case: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సదరు మైనర్ బాలికపై ఇన్నోవా కారులో నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు క్లూస్ టీం గుర్తించింది. కారులో నిందితుల స్పెర్స్ను సైతం కనుగొంది. స్పెర్మ్తో పాటు, నిందితుల వేలిముద్రలు, చెవికమ్మలు, తల వెంట్రుకలు, చెప్పులు తదితర ఆధారాలను క్లూస్ టీమ్ సేకరించింది. ఇటు బెంజి కారులో కూడా చెప్పుల జతలతో పాటు, రెండు షటిల్ కాక్లు, టేపు మాస్క్లు తదితర వస్తువులను సీజ్ చేశారు.
నిందితులు మొదట అమ్నీషియా పబ్బు నుంచి బాలికను బెంజ్ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఇంతకు ముందు పబ్లో ఏం జరిగింది?.. పబ్లో మైనర్లకు ఎంట్రీ ఎలా ఇచ్చారు? అన్న విషయాలపై ఆమ్నీషియా పబ్ మేనేజర్ సాయికిరణ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ అది గెట్ టు గెదెర్ పార్టీ. ఎగ్జామ్స్ టైం అని కొందరు స్టూడెంట్స్ ఈ పార్టీ చేసుకున్నారు. 150 మందికి బుక్ చేసుకున్నారు. అది కూడా ఎలాంటి ఆల్కహాల్ లేని పార్టీని.
ఇందులో 40 శాతం అమ్మాయిలు, 60 శాతం అబ్బాయిలు ఉన్నారు. సీసీటీవీకి సంబంధించిన ఫుటేజీలను మొత్తం పోలీసులకు ఇచ్చేశాము. ఆ అమ్మాయి 8.30 గంటలకు జాకెట్ మర్చిపోయానంటూ మళ్లీ లోపలికి వచ్చింది. తీసుకుని వెళ్లిపోయింది. క్యాజువల్గా వెళ్లిపోయింది. పబ్లో ఎలాంటి గొడవలు జరగలేదు. అయ్యే అవకాశాలు కూడా లేవు. కాలేజ్నుంచి పర్మీషన్ ఉంటేనే పార్టీకి అనుమతి ఇస్తాం. అది కూడా పగలు మాత్రమే అనుమతిస్తాం’’ అని చెప్పాడు. మరి, పబ్ మేనేజర్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: Khammam: రిసెప్షన్ లో సరదాగా గడిపిన కొత్త పెళ్లికొడుకు.. తెల్లారే సరికి ఆత్మహత్య!