Adilabad Crime: తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. నెల రోజుల పరిథిలో మూడు పరువు హత్యలు జరిగాయి. సరూర్ నగర్, బేగం బజార్ ఘటనలు మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. సరూర్ నగర్, బేగం బజార్ ఘటనల్లో అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయిని చంపగా.. తాజా ఘటనలో అమ్మాయిని కన్నవాళ్లే కడతేర్చారు. ఈ సంఘటన ఆదిలాబాద్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ఆదిలాబాద్, నార్నూర్ మండలం నాగుల కొండకు చెందిన రాజేశ్వరి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమిచింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమ విషయం రాజేశ్వరి ఇంట్లో తెలిసింది. ఇద్దరి మతాలు వేరుకావటంతో పెళ్లికి ఒప్పుకోలేదు. కుటుంబసభ్యులు ప్రియుడితో తన పెళ్లికి ఒప్పుకోకపోవటంతో రాజేశ్వరి ఓ నిర్ణయానికి వచ్చింది.
ప్రియుడితో కలిసి ఇంటినుంచి పారిపోయింది. ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకుంది. ఇకపై అంతా సంతోషాలే అనుకుంది. అయితే, తమ కూతురు వేరే మతం వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకోవటంతో రాజేశ్వరి తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. తమ పరువు తీసిందని ఆమెపై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం రాజేశ్వరి గొంతు కోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Hyderabad: హైదరాబాద్ లో దారుణం .. నడిరోడ్డుపై మహిళపై కత్తితో దాడి!