తల్లిదండ్రులు పిల్లలను కనీ పెంచుతారు.. కానీ వారికి ఉన్నతమైన విద్య అంధించి బంగారు భవిష్యత్ కి పునాధులు వేసేది గురువులు. అందుకు గురు బ్రహ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర అంటారు. గురువును సాక్షాత్తు త్రిమూర్తులతో పోల్చారు. అలాంటి గురువు స్థానంలో ఉంటూ నిచమైన బుద్దులు ప్రదర్శిస్తూ సభ్య సమాజానికి మచ్చ తెస్తున్నారు కొంత మంది ఉపాధ్యాయులు. పాఠాలు చెప్పాల్సిన ఉపాద్యాయుడు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో గ్రామస్తులు ఆ టీచర్కు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే.. అచ్చంపేట మండలం జడపల్లి తండాలో ప్రాధమిక పాఠశాల టీచర్ శ్యామలరావు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఇది చదవండి: శాడిస్ట్ ప్రియుడు.. ప్రియురాలిపై స్నేహితులతో అత్యాచారం
పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పైగా ఎవరికి చెప్పొద్దంటూ పిల్లలను భయపెట్టాడని తల్లిదండ్రులు తెలిపారు. ఉపాధ్యాయుడు పైశాచికం మరింత పెరిగింది.. వికలాంగురాలైన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో… గ్రామస్థులు ఆగ్రహంతో దాడి చేసి గదిలో సదరు కీచక ఉపాధ్యాయుడిని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదుతో టీచర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.