Anakapalle: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీచ్లో సరదాగా గడుపుదామని వెళ్లిన కొందరు కాలేజీ విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృత్యువాతపడగా మిగిలినవారి ఆచూకీ తెలియరాలేదు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనకాపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు అక్కడి పూడిమడక సముద్ర తీరంలోని బీచ్కు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి ఆడుకున్నారు.
ఇంతలో ఓ ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. గోపాలపట్నానికి చెందిన జగదీష్, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్, గుంటూరుకు చెందిన సతీష్, చూచుకొండకు చెందిన గణేష్, ఎలమంచలికి చెందిన చందు సముద్రంలో కొట్టుకుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సముద్రంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
వీరిలో ఓ విద్యార్థి మృతి చెందగా.. తేజ అనే విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, తేజ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఇక, మిగిలిన వాళ్ల కోసం మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. గత ఈత గాళ్లు సైతం రంగంలోకి దిగారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గుడికి వెళ్లి వస్తూ అందనంత దూరాలకు! కంటతడి పెట్టిస్తున్న మహిళ మరణం!