చెన్నై- తమిళ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కరోనా బారిన పడింది. దీంతో ఆమె ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని ఐశ్వర్య రజనీకాంత్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కరోనా వచ్చిందని వాపోయింది ఐశ్వర్య.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది.. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను.. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి.. 2022.. ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను.. అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది. ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అన్నట్లు మొన్నటి దాకా కోలీవుడ్ లో స్టార్ కపుల్గా పేరు తెచ్చుకున్న ధనుష్, ఐశ్వర్యలు ఇటీవలె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్, మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కూతురి విడాకుల విషయంలో రజనీకాంత్ ఎంతో ఆవేధన చెందుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇక కొన్ని రోజుల క్రితమే హీరో ధనుష్ కి సైతం కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.