“తిట్టే వాళ్ళు తిట్టని, పొగిడే వాళ్ళు పొగడని డోంట్ కేర్”. పరిపాలన విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఇలానే ఉంటుంది. మంచి అనిపిస్తే చాలు ఆ పనిని వెంటనే పూర్తి చేసేస్తారు ఆయన. ఇది ప్రజలకి అవసరం లేదు అనుకుంటే.. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా ఆ కార్యక్రమాన్ని అస్సలు పట్టించుకోరు. ఇక కరోనా నియంత్రణ విషయంలో కూడా జగన్ ముందు నుండి తన మార్క్ చూపిస్తూనే వస్తున్నారు.
దేశంలో అన్నీ రాష్ట్ర ప్రభుత్వాల కన్నా ముందే కరోనాని ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చి ప్రజలపై భారం తగ్గించారు. దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కానన్ని టెస్ట్ లు నిర్వహించారు. ఇక మొదటి వేవ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేర్ సెంటర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఇదే స్పీడ్ చూపించారు జగన్ మోహన్ రెడ్డి. ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది. ఈ విషయంలో అన్నీ వర్గాల నుండి జగన్ పని తీరుకి అభినందనలు లభించాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ కి ఈ విషయంలో అభినందనలు తెలియచేశారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం నిజంగా ఓ గొప్ప కార్యం. దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కొవిడ్ భూతాన్ని ఓడించగలమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. దయచేసి ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారిది స్ఫూర్తిదాయక నాయకత్వం. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా చిరంజీవి జగన్ తో మంచిగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని జగన్ మళ్ళీ రాజ్యసభకి పంపబోతున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో.., ఇప్పుడు చిరు చేసిన ట్వీట్ పొలిటికల్ జోన్ లో ప్రాధాన్యతని సంతరించుకుంది.
So happy at the fabulous feat of vaccinating over 13.72 lac people in a single day by Health teams in #AndhraPradesh.Your efforts fill confidence in everyone about defeating the Covid monster! Way to go TeamAP. More Power to You!Congrats to Sri @ysjagan for inspiring leadership.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 22, 2021