భార్యాభర్తల వైవాహిక జీవింతలో ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నిటినీ ఎప్పుడైతే అర్థం చేసుకుని ముందుకు సాగుతారో అప్పుడే వారి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ఇలా భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా క్షణికావేశంలో కొందరు వేర్వేరుగా ఉంటున్నారు. అలా ఉండడం ఇష్టం లేని వారి పిల్లలు బయటకు చెప్పలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇలా ఓ తల్లిదండ్రులు వేర్వేరు కాపురాలు పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా చెన్నైలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..చెన్నైలోని నామక్కల్ జిల్లా కొళ్లకురిచ్చి గ్రామం. ఇదే గ్రామం పరిధిలోని సింగలాపురాని ప్రాంతానికి చెందిన రవి, మేఘల దంపతులు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. వీరికి తరుణ్(17)తో పాటుగా ఓ కుమార్తె(20) ఉన్నారు. అయితే కొన్నేళ్ల పాటు ఎంతో సంతోషంగా సాగిన ఈ దంపతుల సంసారంలో ఈ మధ్యకాలంలో అభిప్రాయ భేదాలు వచ్చి చేరాయి. దీని కారణంగా వీరిద్దరు ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: బైక్ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి నగల చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు!
అయితే తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండడంతో పిల్లలు లోలోపల కుమిలిపోయేవారు. దీంతో కుమారుడు తరుణ్ తల్లిదండ్రులు ఇలా వేర్వేరుగా ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే మంగళవారం మా అమ్మనాన్న కలిసి జీవించాలన్నదే తనతో పాటుగా తన సోదరి కోరిక అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
ఇలా పిల్లలను కాదని చిన్న చిన్న కారణాలకు వేర్వేరుగా ఉంటున్న ప్రతీ తల్లిదండ్రులు ఒక్కసారి పిల్లల విషయంలో కూడా ఓ సారి ఆలోచించాలంటున్నారు స్థానికులు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.