ఏపీ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంచి కిక్కిచ్చే వార్త చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. 75 రూపాయలకు చీఫ్ లిక్కర్ అందిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ జనాగ్రహ సభలో మాట్లాడుతూ.. సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార పార్టీనే పచ్చి సారా కాస్తూ.. 3 రూపాయల మద్యాన్ని రూ. 25కు కొని రూ.250కి విక్రయిస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉద్వాసన..?
రాష్ట్రంలో మద్యం తాగే వారు కోటి మంది ఉన్నారని.. వారంతా బీజేపీకి ఓటు వేస్తే రూ. 75కే చీప్ లిక్కర్ ఇస్తామని వెల్లడించారు. ఆదాయం బాగుంటే 50 రూపాయిలకే ఇస్తామని హామీ ఇచ్చారు. మద్యం రూపంలో ప్రజలను దోచి మళ్లీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే, మూడేళ్లలో రాజధాని అమరావతిని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సోము వీర్రాజు వెల్లడించారు. రాజధానిలో రైతుల సమస్యలు తీరుస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. మద్యం ధరలపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.