స్పోర్ట్స్ డెస్క్- న్యూజిలాండ్తో శుక్రవారం ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. సౌథాంప్టన్ వేదికగా రేపు శుక్రవారం ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం తుది జట్టుని సాయంత్రం భారత్ ప్రకటించింది. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కాంబినేషన్తో తుది జట్టుని కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలెక్ట్ చేశాడు. ఆరో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా కనిపించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారిని తప్పించగా, నాలుగో పేసర్గా ఉన్న మహ్మద్ సిరాజ్కు కూడా నిరాశే ఎదురైంది. మరోవైపు ఉమేశ్ యాదవ్కు సైతం అవకాశం దక్కలేదు.
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ మ్యాచ్ ఆడే సౌథాంప్టన్ పిచ్ పేస్కి అనుకూలమని స్పిన్నర్లలో రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్ అశ్విన్లలో ఒకరని తీసుకుంటే సరిపోతుందని మాజీ క్రికెటర్లు బీసీసీఐకి సూచించారు. కానీ జడేజా, అశ్విన్.. ఇద్దరినీ తీసుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ జడేజా నిలకడగా రాణిస్తూవస్తున్నాడు. అందుకే బ్యాటింగ్ లోతుని పెంచుకునేందుకు జడేజాని తీసుకున్నట్లు తెలుస్తోంది. జడేజా ను తీసుకోవడంతో హనుహ విహారిపై వేటు పడిందని తెలుస్తోంది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ మ్యాచ్ ఇండియన్ టీం- రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ. సౌథాంప్టన్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
🚨 NEWS 🚨
Here’s #TeamIndia‘s Playing XI for the #WTC21 Final 💪 👇 pic.twitter.com/DiOBAzf88h
— BCCI (@BCCI) June 17, 2021