బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు యావద్ దేశాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ నిన్న మధ్యాహ్నం ముహల్ ప్రాంతంలోని తాను అద్దెకుంటున్న అపార్ట్మెంట్లో గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల నమోదు అయిన ఆర్యన్ ఖాన్ కేసులో ప్రభాకర్ ముఖ్య సాక్షిగా ఉన్నాడు. ఆయన మృతికి కారణాలు తెలియదు.. అయితే ప్రభాకర్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబం ధృవీకరించిన విషయాన్ని ప్రభాకర్ తరపు న్యాయవాది తుషార్ ఖాండేర్ వెల్లడించారు.
షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ముఖ్య సాక్షిగా ఆ మద్య ప్రభాకర్ పేరు మారు మోగింది. ఆయన కేపీ గోసావీ అనే వ్యక్తి దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. ముంబై క్రూయిజ్ పార్టీలో గోసావీ కూడా ఉన్నాడని.. అక్కడ డబ్బుల వ్యవహారం జరిగింది ఈ కేసులో మరో ముఖ్య సాక్షి సౌమ్ డిసౌజా తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ కేసును విచారిస్తున్న సమీర్ వాంఖడేతో పాటు ఎన్సీబీ పైనా అవినీతి ఆరోపణలు చేశాడు ప్రభాకర్. విచారణ జరుగుతున్న సమయంలో ప్రభాకర్ గుండె పోటుతో చనిపోవడం జరిగింది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుందో ముందు ముందు తెలియాలి.