అమరావతి- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య రోజు రోజుకు సాన్నిహిత్యం పెరుగుతోంది. వీరిద్దరు ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటున్నారు. మొన్న ఆదివారం ఒక్క రోజే ఆంద్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. కోవిడ్ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నం బాగుందని, ఒక్క రోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయించడం అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు.
కోవిడ్ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చిరంజీవి కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఐతే జగన్ ను పొగుడుతూ చిరంజీవి చేసిన ట్వీట్పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. జనసేన కార్యకర్తలు చిరంజీవిపై ఫైర్ అయ్యారు. జనసైనికులు చిరంజీవిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటువంటి సమయంలో చిరంజీవికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. చిరంజీవి ట్వీట్ కు రీ ట్వీట్ చేసిన జగన్ ఆయనకు ధన్యవాదాలు చెలిపారు. దీంతో ప్రస్తుతం జగన్ ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.
ఇక ట్వీట్ లో సీఎం జగన్ ఏమన్నారంటే.. చిరంజీవి గారు, మీ ప్రశంసలకు కృతజ్ఞుడిని.. హృదయపూర్వక మీ మాటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా ధన్యవాదాలు.. ఈ క్రెడిట్ మొత్తం గ్రామ, వార్డు సెక్రటేరియట్స్, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సీ డాక్టర్లు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లకు దక్కుతుంది.. అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మరి ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ పై జనసేన కార్యకర్తలు ఏవిధంగా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
@KChiruTweets Garu, on behalf of the state government, I thank you for your kind words of appreciation. Credit goes to the team effort by the Village/Ward Secretariats, Volunteers, ANMs, ASHA workers, PHC doctors, Mandal Officers, District Officers, JCs & Collectors.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2021
—