ఏపీంలో గత కొంత కాలంగా నడుస్తోన్న సినిమా టికెట్ల రేట్ల వివాదానికి నేటితో శుభం కార్డు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై చర్చించేందుకు అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు విజయవాడ వెళ్లారు. గురువారం ఉదయం 11 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్తో భేటీ అయ్యారు. భేటీలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి, మహేశ్బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్రెడ్డి, ఆర్ నారాయణమూర్తి, పోసాని, ఆలీ వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా భేటీకి హాజరవుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ తప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే… నేడు జగన్ తో భేటీకి హాజరైన వారందరికి ఓ కామన్ పాయింట్ ఉంది. అది ఏంటంటే సినిమాల విడుదల. త్వరలో చిరంజీవి ఆచార్య, మహేష్ బాబు సర్కార్ వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. కనుక ఆయా చిత్రాలకు సంబంధించిన వారంతా భేటీకి హాజరవుతున్నారు. వీటితో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కూడా ఉంది. ఈ క్రమంలో జూనియర్ కూడా భేటీకి వస్తారని భావించారు. అలానే ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషయంలో జూనియర్ భేటీకి వెళ్లకుండా షాక్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : నేడు సినిమా టికెట్ల సమస్యకు శుభం కార్డు: చిరంజీవిఅయితే జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్ తో భేటీకి వెళ్లకుండా ఆగిపోవడం వెనక కుటుంబ, రాజకీయ కారణాలు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికి జూనియర్ టీడీపీలోనే కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోయినా.. టీడీపీలోనే ఉన్నాడు. మరోవైపు ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కు ప్రాధాన్యత పెరుగుతోంది. టీడీపీకి జూనియర్ ఎన్టీఆరే దిక్కు అనే ప్రచారం బలంగా సాగుతోంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా జూనియర్ ని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో.. జూనియర్ భేటీకి హాజరయితే.. అది టీడీపీకి మైనస్, వైసీపీకి ప్లస్ అయ్యే చాన్స్ ఉంది.
కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అసభ్య పదజాలం వాడటం.. చంద్రబాబు మీడియా సాక్షిగా ఏడ్వడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. దీనిపై నందమూరి ఫ్యామిలీ విరుచుకుపడింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా మీడియా ముందుకొచ్చి అధికార పార్టీని హెచ్చరించడం తెలిసిందే. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. మేనత్తను అసభ్యంగా దూషించిన వల్లభనేని వంశీ, ఇతర అధికార పార్టీ నేతలను ఘాటుగా హెచ్చరించకుండా, నీతి వ్యాఖ్యాలు వల్లించారంటూ జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న, బొండా ఉమా తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : సినిమా టికెట్స్: ఏపీలో వినిపించుకునే నాథుడు ఎక్కడ?: బాలకృష్ణతాజాగా సీఎంతో భేటీ కూడా ఇలానే రాజకీయం అయ్యే అవకాశం ఉంది. భేటీకి వెళ్తే.. టీడీపీ నుంచి విమర్శలు తప్పవు. తన భేటీని రాజకీయ కోణంలోనే చూస్తారు. మరోసారి విమర్శలు ఎదుర్కొవడమే కాక.. పార్టీకి మరింత దూరం అయ్యే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే జూనియర్ ఎన్టీఆర్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని.. టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. సీఎం జగన్ తో భేటీకి తనకు మాత్రమే ఆహ్వానం అందిందని చిరంజీవి తెలిపారు. మరీ జూనియర్ కు సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందో లేదో తెలియదు. ఆహ్వానం అందకపోవడం వల్ల కూడా జూనియర్ ఈ భేటీకి హాజరుకాకపోయి ఉండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఏం జరిగిందో కేవలం జూనియర్ కి మాత్రమే తెలుసు.
ఇది కూడా చదవండి : బాలయ్య షోకి గెస్ట్ గా Jr. యన్టీఆర్ రాకపోవడానికి కారణం..