మనం అప్పుడప్పుడు పరధ్యానంలో లేదా పొరపాటున ఒకదానికి బదులు మరొక పని చేస్తుంటాం. ఒక వస్తువుకు బదులు మరొక వస్తువును తీసుకుంటాము. అయితే ఇలా పొరపాటున చేసే పనులు వలన ఒకొక్కసారి ప్రాణాలు సైతం పోతాయి. అలా జరిగిన ఓ పొరపాటు వలన ఓ యువతి ప్రాణాలు కొల్పోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం గ్రామనికి చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తె పాలపర్తి కీర్తి(18)తల్లితో పాటు కూలి పనులకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇంట్లో పొరపాటున పేస్టు అనుకుని ఎలుకల మందును బ్రెష్ పై వేసుకుని కీర్తి పళ్లు తోముకుంది.
ఇది చదవండి : కరోనా కలకలం.. 87 మంది వైద్యులకు పాజిటివ్!
శుక్రవారం సాయంత్రం నుంచి కడుపులో మంటగా ఉందని తల్లికి చెప్పడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించింది. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం కీర్తి మృతిచెందింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీభవాని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇలా చేసిన చిన్న తప్పింద వలన యువతి ప్రాణాలు కొల్పోయింది. ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.