నేటికాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కష్టపడి సంపాదించలేని వారు, సుఖానికి అలవాటు పడి.. ఇతరులు కష్టపడి సంపాందించి.. కూటబెట్టుకున్న సొమ్మును రెప్పపాటు కాలంలో కాజేస్తున్నారు. చివరికి అందరికి అన్నం పెట్టి..ఆదుకునే రైతు ఆరుగాలలు శ్రమించి పండించిన పంటను అమ్ముకుని వస్తుంటే దారి కాచి ఆయన డబ్బు దొగిలించారు. ఆ రైతు వేదన వర్ణాతీతం. ఈఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం గ్రామానికి చెందిన కువ్వాకొల్లి మునిరాజా రేయింబవళ్లు శ్రమించి పడించిన పంటను సూళ్లూరుపేటలోని తనకు తెలిసిన రైస్ మిల్లులో అమ్మాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన ధాన్యాన్ని తీసుకోని సూళ్లూరుపేటలోని ఓ రైస్ మిల్లుకు వెళ్లాడు. అక్కడ మునిరాజా రూ.4.80 లక్షలకు ధాన్యాన్ని అమ్మాడు. ఆ నగదుకు సంబంధించిన చెక్ ను రైస్ మిల్లు యాజమాని ఇవ్వగా.. దానితో స్థానిక యూనియన్ బ్యాంక్ లో డబ్బులు డ్రా చేసుకుని తన బైక్ పై సొంతూరుకు బయలుదేరాడు. మార్గం మధ్యలో ఎదురుగా రెండు ద్విచక్రవాహనాల్లో వచ్చిన నలుగురు యువకులు మీ నగదు కిందపడ్డాయని తెలిపారు.
వారి మాటలు నమ్మిన మునిరాజా వెంటనే వాహనాన్ని ఆపి అటు ఇటు చూశాడు. ఈలోపు ఆ యువకులు ఆ రైతు బైక్ పై ఉన్న రూ.4.80లక్షల నగదు తీసుకుని ఉడాయించారు. వెంటనే తేరుకున్న రైతు.. తన డబ్బు దొంగిలిచిన వారి వెంట కొంతదూరం వరకు పరిగెత్తాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల వివరాల కోసం ఘటన జరిగి ప్రాంతంలోని సీసీపుటేజీలు పరిశీలిస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.