జలీల్ ఖాన్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అధికార టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు జలీల్ ఖాన్ ని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నియమించారు. వీటన్నింటి కంటే బీకాం లో ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల ముందు వరకు జలీల్ ఖాన్ తరచుగా మీడియాలో కనిపించేవారు. ఎన్నికల తర్వాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. మీడియాలో కూడా ఎక్కడా ఆయన ప్రస్తావన కనిపించడం లేదు.
ఈ క్రమంలో తాజాగా జలీల్ ఖాన్.. సుమన్ టీవీకి ఎక్స్క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాలపై, వర్తమాన అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ప్రస్తుతం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిన కొడాలి నానిని ఉద్దేశించి ఒపెన్ చాలెంజ్ చేశారు. ‘కొడాలి ఒక్కడివే వస్తావా.. వంద మందితో వస్తావా.. ఏ గ్రౌండ్ లో అయినా పెట్టుకో.. నేను రెఢీ.. ఎంత మందిని అయినా తెచ్చుకో’ అంటూ సవాలు చేశారు. జలీల్ ఖాన్ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ కింద వీడియోని చూడండి. జలీల్ ఖాన్ వ్యాఖ్యలపైమీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.