పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి కాపాడే వాడు అని అర్థం. అలా కష్టాల్లో ఉన్నప్పుడు కొడుకు ఆదుకుంటాడనని తల్లిదండ్రుల నమ్మకం. అందుకే మగబిడ్డ పుట్టాలని తల్లిదండ్రులు ఎందరో దేవుళ్లను మొక్కుతారు. కుమారుడి కోసం తాము కష్టపడుతూ..వాడిని అల్లారు ముద్దుగా పెంచుతారు. కానీ వారి మాంసంపు ముద్దతో ఏర్పడిన శరీరం తనదనే విషయం మరచి.. అమ్మనాన్నలపైనే దాడి చేసి.. చివరికి వారిని చంపే కసాయి కొడుకుల ఉన్నారు. తాజాగా ఓ కుమారుడు.. ఆస్తికోసం కన్నతల్లిని చెంబుతో దారుణంగా కొట్టి.. అంతటితో ఆగక ఆమెను కాలితో తన్నాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె కిందపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మనందపురంలో నాగమణి అనే వృద్ధురాలు తన భర్తతో కలసి జీవనం సాగిస్తుండేది. ఆమెకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరికి పెళ్లిళు చేసింది. వారికి దూరం నాగమణి దంపతులు జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నాగమణి భర్త చనిపోయాడు. దీంతో అప్పటి వరకు ఆమెకు దూరంగా ఉన్న కొడుకు, కోడలు నాగమణి వద్దకు వచ్చి నివసిస్తున్నారు. ఇటీవల ఆస్తుల విషయమై ఇంట్లో గొడవ జరిగింది. నాగమణి పేరు మీద ఉన్న ఆస్తిని కొడుకు తన పేరు మీద రాయమని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి కొడుకు, కోడలు ఆమెను ఆస్తికోసం వేధించసాగారు.
ఆమె ఆస్తి ఇవ్వకపోవటంతో ఆమెను కొడుకు ఇంటినుంచి గెంటివేశాడు. ఆమెకు ఎవరూ సహాయం చేయక పోవటంతో నిరాశ్రయురాలైంది. ఇటీవల ఆమె తన ఇంటి వద్దకు రాగా కొడుకు ఆమెపట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాన్ని ఎవరో దూరం నుంచి వీడియో తీసి పోలీసులకు పంపించారు. దీంతో పోలీసులు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.