ఏపీలో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ఎయిర్పోర్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒక బాధ్యత గల హోదాలో ఉండి సోమువీర్రాజు అలా వ్యాఖ్యానించడంపై పెద్ద ఎత్తున రాయలసీమ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో సోము వీర్రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రాంత ప్రజలు.. రాజకీయ నేతలు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు తన మాటలపై వెనక్కి తగ్గారు. ఈ క్రమంలోనే రాయలసీమ ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు. అయితే తాను వాడిన పదాలతో రాయలసీమ ప్రజల మనసులు గాయపడ్డాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో ఆ వ్యాఖ్యాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. తన మాటలతో నొచ్చుకున్నవారికి క్షమాపణలు చెప్పారు.
ఇది చదవండి : మితిమీరిన సంబరాలు! రక్తం కారుతున్నా కూడా..
“రాయలసీమ రతనాల సీమ” ఈ పదం నాహృదయం లో పదిలం.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలు వాపసు తీసుకుంటున్నాను.. ఈవిషయంలో క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు, రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.
ఇది చదవండి: భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు
వివేకా హత్యను దృష్టిలో వుంచుకునే తాను అలా మాట్లాడానని ఆయన అన్నారు. కడప ప్రజలకు హత్యా రాజకీయాలకు సంబంధం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. కాగా, ‘రాయలసీమలో ఎయిర్పోర్ట్.. కడపలో ఎయిర్పోర్ట్.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’అని సోము వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
👉 నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు, రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను.
👉 రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన. (2/2)
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) January 29, 2022