పవన్ కల్యాణ్- రానా కాంబో పవర్ ప్యాక్ భీమ్లానాయక్ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి నెలకొంది. వారిని అదుపుచేసేందుకు పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. ఏపీలో ఫ్యాన్ షోలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళనకు దిగారు. ఓ థియేటర్ వద్ద ఆందోళన చేస్తున్న అభిమానులకు ఓ పోలీసు అధికారి వార్నింగ్ ఇచ్చారు. ‘ఇవాళ నేనే భీమ్లానాయక్.. గొడవ చేస్తే బొక్కలో వేస్తా’ అంటూ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.