సాధారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులకు కొన్ని సార్లు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. వాటి విలువ కొన్ని లక్షల్లో ఉంటాయి. కానీ కొన్ని సార్లు మత్స్యకారులకు నష్టాన్ని కలిగించే షార్క్ చేపలు కూడా వలలో చిక్కుతుంటాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మత్స్యకారుల వలకు చేప చిక్కింది. మత్స్యకారులు వల లాగుతున్నప్పుడు బరువుగా ఉండటంతో భారీ స్థాయిలో చేపలు పడి ఉంటాయని అంతా సంబరపడ్డారు. తీరా వలను ఒడ్డుకు చేర్చాక లోపల ఉన్న సొర చేపను చూసి అంతా తలలు పట్టుకున్నారు.
ఇది చదవండి: మనసు చాలా బాధగా ఉంది.. థమన్ ఎమోషనల్ కామెంట్స్..!
మెరుగు నూకయ్య అనే మత్స్యకారుడి వలకు చిక్కింది ఈ భారీ చేప.. దీనిని పులిమొఖం సొరచేపగా పిలుస్తారని, సుమారు వెయ్యి కిలోల ఈ సొర చేప వలకు చిక్కిన సంతోషం కన్నా అది చేసిన నష్టాన్ని తల్చుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ చేప వలలో పడటం, పెనుగులాటతో సుమారు 20 వేల రూపాయల విలువైన వల చిరిగిపోయింది. వలలోని చేపలను కూడా సొర తినేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒడ్డుకు చేర్చిన సొరచేపను మత్స్యకారులు చంపకుండా తిరిగి సముద్రంలోకి అతి కష్టంమీద చేర్చారు. అయితే ఆ చేప వెయ్యి కిలోల బరువు, 15 అడుగుల పొడవు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. అంతరించి పోతున్న వేల్ షార్క్ జాతికి చెందిన ఈ సోర చేపను వేటాడినా, తిన్నా 1972 వన్యప్రాణి చట్టంపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అందుకే ఆ చేపను సురక్షితంగా మళ్లీ సముద్రంలోకి వదిలారు.