గురువులకు ప్రధానంగా ఉండాల్సింది ఓపిక. విద్యా నేర్పించే సమయంలో పిల్లలపై ప్రేమతో చూడగలిగే గుణం ఉండాలి. కానీ నేటి కాలంలో కొందరు ఉపాధ్యాయుల్లో అలాంటి వ్యక్తిత్వం కొరవడింది. విద్యార్థులు చేసే ప్రతి చిన్న తప్పుకు శిక్షించడమే సరైనదిగా భావిస్తుంటారు. ఆ క్రమంలో కొందరు టీచర్స్ విద్యార్థులకు గాయాలయ్యేలా శిక్షించిన ఘటనలు మనం అనేకం చూశాం. అయితే తాజాగా హోం వర్క్ చేయలేదని విద్యార్థులకు పనిష్మెంట్ ఇచ్చిన ఓ టీచర్ సస్పెండ్ అయ్యింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని ఓ టీచర్ అత్యూత్సహం ప్రదర్శించింది. ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులకు హోం వర్క్ ఇచ్చింది. అందులో 9 మంది విద్యార్థులు హోం వర్క్ చేయకుండా క్లాస్ కు హజరయ్యారు. దీంతో ఆగ్రహించిన సదరు టీచర్.. వారిని మోకాళ్లపై కూర్చోబెట్టింది. అంతటితో ఆగక.. వారి ఫోటోలు తీసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపింది. దీంతో ఓ విద్యార్థి తండ్రి ఆగ్రహించి సదరు టీచర్ పై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు స్కూల్ కి వచ్చి పరిశీలించారు. విద్యార్థుల పట్ల అమానుషంగా టీచర్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రిన్సిపల్ ని ఆదేశించారు. దీంతో ఆ పాఠశాల యజమాన్యం సదరు టీచర్ ను సస్పెండ్ చేసింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.