RK Roja : మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు ఓ వృద్ధుడు షాక్ ఇచ్చాడు. ఒంటరిగా ఉంటున్న తనకు పిల్లను చూడాలని అడిగాడు. వివరాల్లోకి వెళితే.. మంత్రి రోజా గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం శిరుగురాజుపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటి ఇంటికి వెళ్లి వారి బాగోగులు విచారించారు. అందుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడితో మాట్లాడారు. ఫించన్ వస్తుందా? లేదా? అని ఆయనను అడిగారు. సదరు వృద్ధుడు సమాధానం ఇస్తూ.. తనకు నెలనెలా ఫించన్ అందుతోందని చెప్పాడు. ఒంటరిగా ఉంటున్న తనకు పెళ్లి కూతుర్ని చూడాలని మంత్రి రోజాకు విన్నవించాడు.
వృద్ధుడి వింత కోరిక విన్న రోజా నవ్వుకున్నారు. ‘ఫించను అయితే ఇవ్వగలం కానీ, పెళ్లి ఎక్కడినుంచి చేస్తాం’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రోజా మంత్రి పదవి పొందిన సంగతి తెలిసిందే. పర్యటక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత ‘జబర్థస్త్’ కామెడీ షో జడ్జి బాధ్యతలనుంచి తప్పుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఓ దాని కోసం మరో ఇష్టమైన దాన్ని వదులుకోవటం తప్పటం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంత్రిగా బిజీగా మారిపోయారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nellore: నెల్లూరు జిల్లాలో బంగారు, రాగి నిక్షేపాలను గుర్తించిన అధికారులు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.