కర్నూల జిల్లా ఆళ్ళగడ్డలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అలాగే గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం చర్చనీయాంశమైంది. తాజాగా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్పై కేసులు నమోదయ్యాయి. అఖిల ప్రియ సొంత పెదనాన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి.. ఖాళీ స్థలంలో కట్టుకున్న కాంపౌండ్ వాల్ కూల్చివేసి వాచ్ మెన్పై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాగా, ఆళ్లగడ్డలో నాలుగు రోజుల క్రిందట రోడ్డు వెడల్పులో భాగంగా స్థానిక ఫోర్ రోడ్ సర్కిల్ వద్ద బస్ షెల్టర్ని తొలగిస్తున్న సమయంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజల కోసం కట్టించిన బస్ షెల్టర్ని ఎలా తొలగిస్తారని కాంట్రాక్టర్తో వాగ్వావాదానికి దిగారు.. కూల్చివేత పనులను అడ్డుకున్నారు. ఆ సమయంలో తనతో దురుసుగా ప్రవర్తించి.. అటాక్ చేయడానికి వచ్చినట్టు తన పనులకు ఆటంకం కలిగించారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు మరో 15మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది చదవండి: 10వ తరగతిలో 600లకి 600 మార్కులు! కలెక్టర్ నే ఆశ్చర్యపరిచిన విద్యార్థి!
ఈ వివాదం కొనసాగుతుండగానే మరో కేసు భూమా ఫ్యామిలీని వెంటాడింది. ఈసారి ఆమె సోదరుడే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. భూమా కిషోర్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు.. 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.. ప్రస్తుతం ఆళ్లగడ్డ ఇంఛార్జ్గా ఉన్నారు.