ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో 13 గా ఉన్న జిల్లాల సంఖ్య ఇప్పుడు 26 కి పెరిగింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలు ఏపీ భౌగోళిక స్వరూపాన్ని మార్చాయి. దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 9 కోస్తా జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సముద్రం వచ్చింది అంటున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే రోజా అయితే సీమకు సముద్రం వచ్చింది అంటూ ట్వీట్ కూడా చేయడం.. అది వైరల్గా మారడమే కాక సెటైర్లు కూడా పేలుతున్నాయి. అసలు సీమకు సముద్రం రావడం ఏంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: షాకింగ్: జబర్దస్త్ జడ్జీ పోస్ట్ నుంచి రోజా అవుట్!
తిరుపతి జిల్లాలో.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం కలిసింది. అలాగే సముద్రతీరంలో ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు కూడా తిరుపతి జిల్లాలో చేరింది. దీంతో రాయలసీమ పరిధిలో ఉన్న తిరుపతి జిల్లాకు సముద్రం వచ్చేసిందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. అంతేకాదు మరో మార్పు కూడా జరిగింది. ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా మారింది.
ఇది కూడా చదవండి: మంత్రి పదవి కోసం రోజా మాస్టర్ ప్లాన్! జగన్ కే చెమటలు!
గుంటూరు ఉమ్మడి జిల్లాలో సముద్రతీరం ఉండేది. విభజన తర్వాత సముద్ర తీరం దూరమైంది. బాపట్లలోని సూర్యలంకకు సముద్ర తీరం ఉండేది. అది కాస్త ఇప్పుడు బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోయింది. దీంతో గుంటూరు జిల్లా తీరం లేని జిల్లాగా మారింది. రాయలసీమకు సముద్రం రావడంపై ఎమ్మెల్యే రోజా కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
‘ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాల పునర్ విభజనకు శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు. 26 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. పునర్వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాల పునర్ విభజనకు శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు. 26 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
పునర్వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం సంతోషంగా ఉంది.#26DistrictsInAP pic.twitter.com/TALL7gUZzu
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 4, 2022
దీనిపై తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నారు. వామ్మో మీ జగన్ సీమకు సముద్రం తెచ్చాడా.. అలా అయితే.. మిగతా ఏదో ఓ జిల్లాకు హిమాలయాలను కూడా తెమ్మనకపోయారా.. ఇదే తర్కం లేని లాజిక్ అంటూ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.