ఫుడ్ ఛాలెంజ్లు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండవుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఫుడ్ ఛాలెంజ్లు విసరడం ప్రారంభించాయి. మొన్నటి వరకు బాహుబలి థాలి తింటే భారీ బహుమతులు అని విన్నాం. ఇప్పుడు చాలా రెస్టారెంట్లు ఇలాంటి సవాళ్లు విసురుతున్నాయి. కాకపోతే ఇలాంటి ఛాలెంజ్లలో భారీగా ఆహారం తినాల్సి ఉంటుంది. ఫుడ్ వేస్ట్ చేయకుండా తింటేనే ఛాలెంజ్ లో గెలుస్తారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఇంట్లో జరుపుకునే ఫంక్షన్లలో కూడా మొదలవుతుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
యన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి ఆయన కూతురు ఓనీ ఫంక్షన్ లో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తన కూతురు ఓనీ ఫంక్షన్ కి వచ్చినవారికి ఓ పరీక్ష పెట్టాడు.. అందులో నెగ్గిన వారికి బహుమతి కూడా ప్రకటించాడు. దానికి సంబంధించిన పాంప్లెంట్ ముద్రించాడు. పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.రూ.10116, ద్వితీయ బహుమతి రూ.3,116, తృతీయ బహుమతి కూలింగ్ వాటర్ క్యాన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అన్నపూర్ణ సేవా సమితి సభ్యులతో కలిసి ప్రకాశ్ ఏర్పాటు చేశారు.
ఇక పోటీలో పాల్గొనేవారు.. ప్లేట్ లో వడ్డించిన పదార్థాల్లో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా పూర్తిగా ఖాళీ చేయాలి. అలా చేయని వారు అనర్హులుగా ప్రకటిస్తారు. ఇంకేముంది ఇదేదో వెరైటీగా ఉందని చాలా మంది పోటీలో పాల్గొన్నారు. కాంపిటీషన్ బాగా పెరిగిపోవడంతో.. లాభం లేదని ప్లేట్లు పూర్తిగా ఖాళీ చేసిన వారి పేర్లు రాసి లాటరీ ద్వారా జబర్ధస్త్ టీమ్ తో తీయించారు. అలా లాటరీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు. ఏది ఏమైనా ఫంక్షన్లలో ఆహారం ఎలాంటి వేస్ట్ కాకుండా మంచి పని చేశారని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: నిజాయితీకి నిలువెత్తు రూపం.. ఈ ట్రాఫిక్ పోలీస్.. రోడ్డుపై దొరికిన.. రూ. 45 లక్షలను..!