కేఏ పాల్.. ఈ పేరు వినగానే.. ఆయన నోటి నుంచి వెలువడే కామెడీ డైలాగ్లు, పిచ్చి చేష్టలు ఇవే గుర్తుకు వస్తాయి. కేఏ పాల్ అనగానే కామెడీ పీస్ అనే ఫీలింగ్ మనసులోకి వచ్చేస్తుంది. దానికి తగ్గట్టే మీడియా ఆయనను ఎగతాళి చేస్తూ.. ఆయన మీద కామెడీ వీడియోలు చేస్తూ.. కించపరుస్తుంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం వరకు కేఏ పాల్ అంటే ఓ ప్రభంజనం.. సంచలనం. ఆయన కోసం, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల కోసం ప్రపంచ మీడియా పడిగాపులు కాసేది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఓ జోకర్లా మారిపోయాడు. మరి ఆయన పరిస్థితి ఎందుకు ఇలా మారింది.. ఎందుకు ఇలా పతనమయ్యారు అనే డౌట్ ఆయన అభిమానుల్లో ఉంది. దీనిపై కేఏ పాల్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనను కేఏ పాల్ వివరించారు.
తన భార్య అనారోగ్యంతో 68 రోజుల పాటు ఐసీయూలో ఉందని ఆ సమయంలో.. తాను దేవుడితో దెబ్బలాడనని.. ఆయన మీద అలిగానని కేఏ పాల్ తెలిపారు. తన భార్య కోలుకోకపోతే.. తాను దైవ సహాయకుడిగా ఉండనని దేవుడికి కండీషన్ పెట్టానని తెలిపారు. ఆ 68 రోజుల పాటు.. ప్రతి రోజు గంటల తరబడి ప్రార్థన చేశానని.. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుందని తెలిపారు. అదే సమయంలో తాను రాజకీయాల్లోకి రానని దేవుడికి తెలిపానని వెల్లడించారు. అంతేకాక తనకు ఇప్పటికే రెండు సార్లు భారతరత్న ఇవ్వడానికి ప్రయత్నించారని.. ఇప్పటికి కూడా మోదీ ప్రభుత్వం తనకు భారతరత్న ఇస్తానని ప్రపోజల్ పెట్టిందని.. కానీ తాను అంగీకరించలేదని కేఏ పాల్ తెలిపారు. అలానే ఏపీ, తెలంగాణ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.