ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. అడవి పందుల చూసి బెదిరిపోయిన వందలాది పందులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. అప్రమత్తమైన మత్స్యకారులు 400 ఆవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చగా, మరో 50 వరకు గల్లంతయ్యాయి. ఈ సంఘటన నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..
నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద కొంత మంది పశువులను గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కనున్న మైదాన ప్రాంతంలో ఆవులమందను నిలిపారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆవులు ఒక్కసారే భయాందోళనకు గురి అయ్యాయి. కారణం ఆ సమయంలో అటువైపు అడవి పందుల గుంపు పరుగులు తీస్తూ రావడంతో ఆవులు బెదిరిపోయాయి. సుమారు 500 ఆవులు జలాశయం కట్టపైకి చేరాయి. 450 ఆవులు జలాశయంలో దూకేశాయి.
జలాశయంలోకి దూకిన ఆవులను అక్కడే ఉన్న కాపరులు గమనించి వెంటనే అలర్ట్ అయ్యారు. దగ్గరలోని మత్స్యకారుల సహకారంతో ఆవులను ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో కొన్ని ఆవులు కొట్టుకుపోగా మిగిలిన ఆవులు బయటకు వచ్చాయి. ఇటీవల వర్షాలు పడటంతో ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల ఆవులు, దూడలు కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
జలాశయంలోకి ఆవులు దుకిన విషయం తెలసుకున్న అధికారులు పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ వద్ద వాటర్ ఇన్ ఫ్లోని తగ్గించారు. జలాశయంలో కొట్టుకుపోయిన వాటి గురించి రెవెన్యూ, పోలీస్ లతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఏది ఏమైనా ఆవులు అలా గల్లంతు కావడంతో తమకు ఎంతో నష్టం వాటిల్లిందని యజమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is an amazing rescue story. Fishermen of #Nandyala district in #AndhraPradesh noticed a lot of cows floating in the Velugodu reservoir which was brimming due to #floods. The fishermen devised a plan and started directing the cows to land. 1/2 pic.twitter.com/tqrAVj1eEH
— Krishnamurthy (@krishna0302) July 22, 2022