ఏపీలో పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరుసటి రోజు ఆయనకు చిత్తూరు నాలుగో అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. కాగా, మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.
పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, అందుకే బెయిల్ రద్దు చేయాలని కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.చట్టం ముందు అందరూ సమానమే అంటూ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. అయితే, టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీలో నారాయణ ప్రమేయం పక్కాగా ఉందని.. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వమే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవమారంలో ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
గతంలో తాను నారాయణ విద్యా సంస్థ ఆయనదైనప్పటికీ.. 2014లోనే విద్యా సంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేశారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆ విద్యా సంస్థలతో నారాయణకు ప్రస్తుతం ఎలంటి సంబంధం లేదని తెలిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించారు. నారాయణ తరుపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీనుతో నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.