ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరల విషయంలో జీవో నెంబర్ 35 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో ఏపీ ప్రభుత్వానికి, సినీ పెద్దల మధ్య వివాదం ముదరడానికి కారణమైంది. ఈ జీవోతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పూర్తిగా తగ్గించడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఐతే తెలుగు సినీ పరిశ్రమ మనుగడ సాధించినట్టేనని వాపోతున్నారు. ఈ విషయంలో గత కొంతకాలం వివాదం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా టిక్కెట్ల సమస్యపై కొందరు టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎంను కలవనున్నారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరనుంది టాలీవుడ్ బృందం. చిరంజీవితోపాటు మహేష్బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వెళ్తున్నారు. ఏపీలోని సినిమా టికెట్ల సమస్యకు ఈ రోజు ఎండ్ కార్డు పడుతుందని మెగాస్టార్ అన్నారు. “సీఎం జగన్ నుంచి నాకు మాత్రమే ఆహ్వానం ఉందని తెలిసింది. కాసేపట్లో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సినిమా ప్రతినిధుల బృందం కలవనుంది. మరి.. చిరంజీవి చెప్తున్నట్టు ఈరోజుతో టికెట్స్ రేట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.