Narayana: పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్నం లీకేజీ కేసులో మాజీ మంత్రి పి.నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్లోని వారి నివాసంలో ఏపీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం హైదరాబాద్నుంచి చిత్తూరుకు తరలించారు. ప్రస్తుతం ఈ అరెస్ట్పై రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ నేతలు దీన్ని ప్రభుత్వపు రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొంటున్నారు. నారాయణ కుమారుడు నిషిత్ వర్ధంతి రోజునే వారిని అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ అరెస్ట్పై ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఫేస్బుక్ వేదికగా మంగళవారం స్పందించారు. ‘‘ నాలుగేళ్ళ క్రితం ఇదేరోజు నారాయణ విద్యాసంస్థల యజమాని ఏకైక కుమారుడు ప్రమాదంలో మరణించాడు. కార్యక్రమం చేయాల్సిన ఇదేరోజు నారాయణ గారి దంపతులిద్దరిని అరెస్టు చేయడం యాదృచ్చికం లేదా కక్షసాధింపునా? ఎవరైనా సమయం బాధాకరం. ఇదేమి మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రోశయ్య గారి హయాంలో ఒకసారి అరెస్టు చేశారు.
ఈ స్థాయికి వచ్చిన ఆయన, అదీ జగన్ గారి ప్రభుత్వంలో(అంటే ఎవరున్నా సరే) మొన్న 10 తరగతి ప్రశ్నపత్రాలు మొన్న లీక్ చేయించారా లేదా, నిజాలు న్యాయస్థానం తేలుస్తుంది అమరావతి విషయంలో వేరే కేసు కూడా పెట్టారంట. ఒక వేళ దీనిలో బెయిల్ వస్తే వేరే దానిలో అరెస్టు కోసమా అని కొందరి సందేహం. డా.నారాయణ గారు నాకు వ్యక్తిగత పరిచయం లేదు, ఆ కేసుల్లో నిజానిజాలు నాకు తెలియవు కానీ, వారికి సర్టిఫికేట్ ఇవ్వలేము. వాటిపై విచారణ గౌ. న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. వారికే వదిలిపెడదాము. తప్పు చేస్తే శిక్ష పడాలి. పారదర్శకంగా విచారణ సాగాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి. కానీ ఇంకా ప్రాధాన్యత అంశాలు, భావితరాల భవితకు అవసరమైన విభజన హామీల అమలు వీటిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య దృష్టి పెట్టకపోవడం బాధాకరం’’ అని పేర్కొన్నారు. మరి, చలసాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Narayana: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వెనుక ఇంత జరిగిందా?