ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా.. ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ సాంఘీకశాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
విజయవాడ.. వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో మంత్రి కారులోనే ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఏ ప్రమాదం లేదని అందరూ.. ఊపిరి పీల్చుకున్నారు.
ఇక మేరుగు నాగార్జున విషయానికి వస్తే.. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: వీడియో: తూర్పు గోదావరి జిల్లాలో వరద బీభత్సం.. చూస్తుండగానే కళ్ల ముందే కుప్పకూలిన ఆలయం