ప్రస్తుతం సమాజంలో ప్రేమ వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో.. చదువుకోవాల్సిన వయసులో.. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేస్తూ.. తప్పుదోవ పడుతున్నారు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటనలు నిత్యం అనేకం వెలుగు చూస్తున్నాయి. తెలసి తెలియని వయసులో ప్రేమలో పడటం.. పెళ్లి అంటూ ఇంటి నుంచి వెళ్లిపోవడం వంటి చేష్టలకు పాల్పడుతూ.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఏపీలో వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థిని, విద్యార్థులు ప్రేమించుకున్నామని.. పరీక్షలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుందామని భావించి.. ఏకంగా పరీక్షా కేంద్రానికి ఉంగరాలు కూడా తెచ్చుకున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Most Wanted Man: ఫ్రస్టేషన్.. 36 జిల్లాల్లో 113 మంది మహిళలను వేధించాడు.. చివరకు..
ఈ సంఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. పదో తరగతి పరీక్షలు చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. పదో తరగతి ఆఖరి పరీక్ష పూర్తవ్వగానే పెళ్లి చేసుకోవాలని భావించి.. ఎగ్జామ్ హాల్కు ఉంగరాలు తెచ్చుకున్నారు. పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్ వారి వద్ద ఉంగరాలు గుర్తించి ఎందుకు అని ప్రశ్నించడంతో అసలు విషయం బయటిపడింది. దాంతో ఇన్విజిలేటర్తో పాటు ఉపాధ్యాయులు కూడా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Power Cut: తాళి కట్టే టైమ్కి కరెంట్ కట్! చెల్లికి బదులు అక్కకు..!